టీడీపీ నాయకులపై కల్లూరు సీఐ దాష్టికం..

ABN, First Publish Date - 2023-11-05T08:48:07+05:30 IST

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై అక్రమకేసుల సంఖ్యతోపాటు వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్బంగా జరిగిన అల్లర్లలో ఏకంగా 580 మంది టీడీపీ నాయకులపై..

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై అక్రమకేసుల సంఖ్యతోపాటు వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్బంగా జరిగిన అల్లర్లలో ఏకంగా 580 మంది టీడీపీ నాయకులపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారు. తాజాగా కల్లూరు పోలీసులు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో తన పేరు ఉందేమోనని హైకోర్టులో బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా అతని పేరు ఎఫ్ఐఆర్‌లో లేదని న్యాయస్థానం పేర్కొంది. ముందు జాగ్రత్తగా ఆయన హైదరాబాద్‌లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-05T09:26:05+05:30