Pawan Kalyan: ఆఖరికి డైమండ్‌ రాణి రోజా కూడా..

ABN, First Publish Date - 2023-01-13T08:37:51+05:30 IST

‘మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డీ..(Chief Minister Jagan Mohan Reddy) నీ తండ్రి వైఎస్‎నే

శ్రీకాకుళం: ‘మూడు ముక్కల ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డీ..(Chief Minister Jagan Mohan Reddy) నీ తండ్రి వైఎస్‎నే ఎదిరించా.. నువ్వెంత’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ( Janasena president Pawan Kalyan) విరుచుకుపడ్డారు. గురువారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం వద్ద ‘యువశక్తి’ పేరిట ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇద్దరు మంత్రులు.. ఒకరు కాయ్‌ రాజా కాయ్‌.. మరొకరు ఆటిన్‌ రాజా.. ఇంకొకరు డైమండ్‌ రాణి.. మన ఐటీ మినిస్టర్‌ నీచ్‌ కమీన్‌ కుత్తే.. ఓ సన్నాసి. ఓ మహిళపై మర్డర్‌ కేసు పెట్టించాడు. ఓ సంబరాల రాంబాబు. ఆఖరికి డైమండ్‌ రాణి రోజా.. వీళ్లా నన్ను విమర్శించేది? మీ కోసమే తిట్టించుకుంటున్నానని పవన్ అన్నారు.

Updated at - 2023-01-13T08:45:50+05:30