AP News: నెల్లూరులో గిరిజనుల వినూత్న నిరసన..
ABN, First Publish Date - 2023-05-09T14:14:11+05:30 IST
నెల్లూరు: వైసీపీ నేతల అక్రమాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చివరికి శ్మశానాలను కూడా అక్రమార్కులు వదలడంలేదు.
నెల్లూరు: వైసీపీ నేతల అక్రమాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. చివరికి శ్మశానాలను కూడా అక్రమార్కులు వదలడంలేదు. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మరుభూమిని సయితం ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. టీపీ గూడూరు మండలం, కోడూరు గిరిజన కాలనీ శ్మశానంలో వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిలోంచి పుర్రెలు, ఎముకలు కనిపిస్తున్నా కూడా తవ్వకాలు మాత్రం ఆపడంలేదు. దీంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. చనిపోయిన వారిని కూడా వైసీపీ నేతలు వదలడంలేదని వాపోయారు. ఇలాంటి అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated at - 2023-05-09T14:14:11+05:30