డెక్కన్ క్రానికల్కు ఈడీ బిగ్ షాక్..
ABN, First Publish Date - 2023-06-14T10:18:36+05:30 IST
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామ్రెడ్డి, పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మనీ ఊమెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఎన్ఫొర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్ట్ చేసింది. టి.వెంకట్రామ్రెడ్డి, పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మనీ ఊమెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కెనరా, ఐడీబీఐ బ్యాంకులను మోసం చేసిన కేసులో వారిని అరెస్టు చేశారు. రూ.8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అభియోగాలు ఉన్నాయి. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్పై ఈడీ దర్యాప్తు చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని డెక్కన్ క్రానికల్కు చెందిన 14 ఆస్తులను అటాచ్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-06-14T10:18:36+05:30