కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్
ABN, First Publish Date - 2023-10-18T11:13:55+05:30 IST
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ప్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ప్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు ఆయన భార్య, హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజితా గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతోపాటుగా చేరిన ఇద్దరు కార్పొరేటర్లు కలుపుకుని ఇప్పటి వరకు ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరినట్లయింది. శేర్లింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్ను రంగంలోకి దించేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-18T11:13:55+05:30