హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
ABN, First Publish Date - 2023-09-13T11:18:50+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును.. దాని ఆధారంగా జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును.. దాని ఆధారంగా జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత వాజ్యంలో విచారణ పూర్తి అయ్యేంతవరకు ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. మంగళగిరి సీఐడీ, ఎస్హెచ్వో, ఏపీఎస్ఎస్డీసీ కార్పొరేషన్ ఛైర్మన్ కె.అజయ్ రెడ్డిని ఈ వాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును అభ్యర్థించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-13T11:18:50+05:30