అమిత్షాపై బీజేపీ నేతల అసంతృప్తి
ABN, First Publish Date - 2023-09-20T10:39:02+05:30 IST
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అమిత్ షా నిర్వహించిన సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపట్ల వారు కినుక వహించినట్లు సమాచారం.
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అమిత్ షా నిర్వహించిన సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపట్ల వారు కినుక వహించినట్లు సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ నివాసంలో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు డా. విజయరామారావు, రవీంధ్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-09-20T10:39:02+05:30