Bandi Sanjay: ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తావా?

ABN, First Publish Date - 2023-01-18T12:26:54+05:30 IST

నీకు దమ్ముంటే, నాతో రాజకీయం చెయ్యి..అంటూ సీఎం కేసీఆర్(CM KCR)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

హైదరాబాద్: నీకు దమ్ముంటే, నాతో రాజకీయం చెయ్యి..అంటూ సీఎం కేసీఆర్(CM KCR)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు బండి భగీరథపై దుండిగల్‌ ఠాణాలో కేసు నమోదవ్వడంపై తీవ్రంగా స్పందించారు. ‘‘తానే తప్పు చేసినట్లు శ్రీరాం అనే అబ్బాయి ఒప్పుకొన్నాడు. అయినా.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు. కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫిర్యాదు ఎవరు చేశారు? నా కొడుకుతోసహా.. ముగ్గురు పిల్లల జీవితాలను నాశనం చేస్తావా?’’ అని సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated at - 2023-01-18T12:26:56+05:30