Kurnool: అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల..
ABN, First Publish Date - 2023-05-22T10:43:36+05:30 IST
కర్నూలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
కర్నూలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందన్నారు. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల బృందం పర్యవేక్షణలో సీసీయూ (CCU)లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, అయానోట్రోపిక్ సపోర్ట్లో ఉందని, ప్రస్తుతం ఆమెకు వాంతులు వస్తున్నాయని.. వాంతులు కొనసాగితే, అల్ట్రాసౌండ్ ఉదరం, మెదడు యొక్క ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. శ్రీలక్ష్మికి బీపీ తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసియూలో ఉంచాల్సిన పరిస్థితి ఉందని డాక్టర్లు తెలిపారు.
Updated at - 2023-05-22T10:43:36+05:30