జగన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-10-31T11:48:56+05:30 IST

మంగళగిరి (గుంటూరు జిల్లా): తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని తప్పులేకపోయినా అక్రమంగా కేసు పెట్టి.. జైల్లో పెట్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

మంగళగిరి (గుంటూరు జిల్లా): తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని తప్పులేకపోయినా అక్రమంగా కేసు పెట్టి.. జైల్లో పెట్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఇవాళ బాబుకు బెయిల్ వచ్చిందని.. అయినా తమకు చాలా బాధగా ఉందని.. ఎందుకంటే తప్పు చేసి జైలుకు వెళితే బాధపడేవాళ్లం కాదని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎక్కడా తప్పు చేయలేదని, ఎవరైనా తప్పు చేస్తే మందలించేవారని అన్నారు. చంద్రబాబు కేసులో ఒక్క ఆధారం కూడా చూపించకుండా 53 రోజులు జైల్లోపెట్టారని, చాలా బాధగా ఉందన్నారు. జగన్ లాంటి దుర్మార్గుడిని ఎక్కడా చూడలేదని అచ్చెన్నాయుడు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-31T11:48:56+05:30