నామరూపాలు లేని ఏపీ రాజధాని రోడ్లు
ABN, First Publish Date - 2023-11-11T09:59:04+05:30 IST
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కక్ష కారణంగా రాజధాని అమరావతి ఎప్పుడో కళ తప్పింది. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాజధాని రహదారులు నామరూపాలు లేకుండా పోయాయి. ఆనవాళ్లు కూడా లేనంతగా శిథిలమై దాదాపు అంతర్థానమైపోతున్నాయి.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కక్ష కారణంగా రాజధాని అమరావతి ఎప్పుడో కళ తప్పింది. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాజధాని రహదారులు నామరూపాలు లేకుండా పోయాయి. ఆనవాళ్లు కూడా లేనంతగా శిథిలమై దాదాపు అంతర్థానమైపోతున్నాయి. అధికారపార్టీ నేతల అండదండలతో గడిచిన నాలుగున్నరేళ్లలో రోడ్డును తవ్వి గుళక, ఇసుక తరలించుకుపోయారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటో అర్థమవుతోంది. రాజధాని గ్రామాల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కనుమరుగైంది. తుళ్లూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్డు పైపొర మొత్తం కొట్టుకుపోయి గుళకదేరి రాళ్ళకట్టలా రోడ్డు మారిపోయింది. చాలా చోట్ల అడుగులోతు గుంటలతో ప్రమాదకరంగా తయారైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-11T09:59:51+05:30