తమిళనాడులో నెల రోజుల వ్యవధిలో 10 పులులు మృతి

ABN, First Publish Date - 2023-09-28T11:31:37+05:30 IST

తమిళనాడు: అడవికే రాజుగా భావించే పెద్ద పులులకే రక్షణ లేకుండా పోయింది. వరుస ప్రమాదాలు.. వేటగాళ్ల కారణంగా పులులు మరణిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

తమిళనాడు: అడవికే రాజుగా భావించే పెద్ద పులులకే రక్షణ లేకుండా పోయింది. వరుస ప్రమాదాలు.. వేటగాళ్ల కారణంగా పులులు మరణిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. నీలగిరి జిల్లాలో గడచిన నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 10 పెద్ద పులులు మృత్యువాతపడ్డాయి. పెద్ద పులులతోపాటు పులిపిల్లలకు కూడా రక్షణ కరువైంది. 20 రోజుల వ్యవధిలోనే సుమారు 6 పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఇప్పుడు అదే అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పులుల మరణాలకు సంబంధించిన అసలు కారణాలు తెలియడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-09-28T11:31:37+05:30