‘ఆహారభద్రత’పై ఆశలు
ABN , First Publish Date - 2023-12-05T23:30:19+05:30 IST
కొత్త ప్రభు త్వం ఏర్పాటుతో ప్రజ ల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని తక్షణమే అమలు చేయాలని కోరు తున్నారు. అయితే.. ఆయా పథకాలకు రేషన్కార్డులు కీలకమైతే మాత్రం తమకు నిరాశ తప్పదని వాటిని ఇప్పటి వరకు పొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్కార్డులు ఇప్పటికైనా వచ్చేనా..?!
పెండింగ్లో వేలాది దరఖాస్తులు
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు
సంక్షేమ ఫలాలు అందక ఇబ్బందులు
కొత్త సర్కారుపై గంపెడాశలు
భూపాలపల్లి కలెక్టరేట్, డిసెం బరు 5: కొత్త ప్రభు త్వం ఏర్పాటుతో ప్రజ ల్లో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని తక్షణమే అమలు చేయాలని కోరు తున్నారు. అయితే.. ఆయా పథకాలకు రేషన్కార్డులు కీలకమైతే మాత్రం తమకు నిరాశ తప్పదని వాటిని ఇప్పటి వరకు పొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రేషన్కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు. కార్డులు లేక ఏళ్లతరబడి సంక్షేమ పథకాలకు దూరమయ్యామని, రేషన్ బియ్యం పొందలేకపోతున్నామని పలువురు అంటున్నారు. నూతన ప్రభుత్వమైనా తమకు రేషన్కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రేషన్కార్డులు జారీకాక జిల్లాలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కార్డులు పొందేందుకు కొందరు, ఉన్న కార్డులో మార్పులు చేర్పులకు మరికొందరు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నాయి. అయినా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మళ్లీ మోక్షం కలగలేదు. ఈ క్రమంలో 2020లో లాక్డౌన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రేషన్కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, రూ. 2 వేల నగదు అందించారు. రేషన్ కార్డులేకపోవడంతో జిల్లాలోని వందల మందికి ప్రభుత్వాల సహాయం అందకుండా పోయింది. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిన తర్వాత 2021 జూలైలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రేషన్కార్డులు మంజూరు చేసినట్టే చేసి ఉన్నట్టుండి ఆ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో చాలా మందికి కొత్తకార్డులు అందకుండా పోయాయి. కొన్నిటికి మాత్రమే మోక్షం కలగగా అధిక సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. సుమారు 3 వేల మాత్రమే కార్డులు జారీ కాగా వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అంత అనేది అధికారులే చెప్పలేకపోతున్నారు.
ఓపెన్ కాని లాగిన్
ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ఈ-పాస్ సైట్ను వినియోగించేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. ఈ సవరణల దరఖాస్తులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా పౌరసరఫరాల అధికారులకు పంపాల్సి ఉంటుంది. కానీ రెండున్నరేళ్లుగా లాగిన్ ఓపెన్ కాకపోవడంతో నూతన కార్డులు మంజూరుకావడం లేదు. ఉమ్మడి కుటుంబాల వివరాలు మార్పులు చేయాల్సి వస్తే ముందుగా కార్డులో నుంచి పేరు తీసివేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పటి వరకు ఉమ్మడి కార్డుల నుంచి పేరు తొలగించు కొని నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకు న్నారు. కార్డులు మంజూరుకాకపో వడంతో వారికి నిరాశే ఎదు రైంది. ఉన్న కార్డుల్లో పేరు లేకపోవడం, కొత్త కార్డు మంజూరుకాకపో వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేషన్కార్డులు లేక ప్రభుత్వ పథకాలు అందక...
కొత్త రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కనీసం ఎన్నికల ముందైనా రేషన్కార్డులు ఇస్తారని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన గృహలక్ష్మి, బీసీలకు రూ. లక్ష ఆర్థికసాయం, డబుల్ బెడ్రూం, కల్యాణలక్ష్మి తదిత పథకాలకు రేషన్కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్తగా పెళ్లై రేషన్కార్డు రాని వారు అనర్హులు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు రేషన్కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోవడంతో కూడా తీవ్రంగా అవస్థ పడుతున్నారు.
సంక్షేమ పథకాలకు రేషన్కార్డే ప్రమాణికం
ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో రేషన్ కార్డులనే ప్రభుత్వాలు ప్రమాణికంగా తీసుకుంటు న్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కూడా ఈ కార్డులే కీలకం కానున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి రేషన్కార్డుదారులు తప్పనిసరి కాగా వాటిని వీలైనంత త్వరలో మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.