గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-06-07T23:58:08+05:30 IST

టీఎ్‌సపీఎ్‌ససీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

51 పరీక్ష కేంద్రాలు... 21,036 మంది అభ్యర్థులు

హనుమకొండ రూరల్‌, జూన్‌ 7: టీఎ్‌సపీఎ్‌ససీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 51 సెం టర్లు ఏర్పాటు చేయగా 21,036మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన లైజన్‌, అసిస్టెంట్‌ లైజన్‌ ఆఫీసర్స్‌, రూట్‌ ఆఫీసర్స్‌, ఇతర సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రతీ సెంటర్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిం చి, మెడికల్‌ క్యాంప్‌ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10.30 నుంచి 1 గంట వర కు నిర్వహించే పరీక్ష హాలులోకి ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలు తీసుకురాకూడదని, తమకు సంబంధించిన సెంటర్‌ను ఒక రో జు ముందుగానే చెక్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీసీపీ ఎంఎ.బారి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌ కుమా ర్‌, డీఎండబ్ల్యూఓ మేన శ్రీను, ఇండస్ట్రీస్‌ జీఎం హరిప్రసాద్‌, డీఈవో అబ్దుల్‌ హై, కలెక్టరేట్‌ ఏఓ కిరణ్‌ ప్రకాశ్‌, టీఎ్‌సపీఎ్‌ససీ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:58:08+05:30 IST