సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2023-01-26T20:03:54+05:30 IST

జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమరంభీమ్ కాలనీలో దారుణ ఘటన చోటోచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి: జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమరంభీమ్ కాలనీలో దారుణ ఘటన చోటోచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణ హత్య చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి మృతదేహాన్ని దుండగులు తగలబెట్టినట్లు తెలుస్తోంది. మృతుని వయస్సు 35 నుంచి 40 సం. ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడే హత్య చేశారా లేక మరోచోట హత్య చేసి ఇక్కడ తీసుకువచ్చి తగలబెట్టారా అన్న కోణంలో రామచంద్రపురం పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-01-26T20:03:56+05:30 IST