TS News: ఆ వార్తల్లో నిజం లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

ABN , First Publish Date - 2023-01-31T17:34:51+05:30 IST

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్‌రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు.

TS News: ఆ వార్తల్లో నిజం లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్: రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్‌రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు. టెక్నికల్ (Technical) సమస్యలతో కొన్ని చోట్ల తాము విద్యుత్ (Power) ఆదా చేస్తున్నామన్నారు. పవర్ కట్ కోసం ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో రైతులు (Farmers) ఎక్కడా ఆందోళనలు చేయడం లేదన్నారు. గతంలో కంటే ఈసారి 3వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి పెరిగిందని ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండదని సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-31T17:34:54+05:30 IST