యువతులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:16 AM
యువతులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి లత అన్నారు.
మేడ్చల్ టౌన్, డిసెంబరు 16: యువతులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి లత అన్నారు. రెండు రోజులుగా పలు కళాశాలల విద్యార్థినులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శనివారం నాటికి ముగిసాయి. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు, గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ...ప్రత్యేకంగా యువతుల్లో ఉన్న కీడ్రా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినిలు చురుగ్గా పాల్గొనటం ప్రశంసనీయమన్నారు. చదువులకు పరిమితంగా కాకుండా క్రీడా రంగంలోకూడా విద్యార్ధినిలు ప్రావిణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం కబడ్డీ, ఖో..ఖో. బాస్కెట్ బాల్, వాలిబాల్ టెన్సీస్ , త్రోబాల్ క్రీడా పోటీలను నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన మల్లా రెడ్డి కళాశాలల విద్యార్ధులను ప్రిన్సిపాల్ అభినందించారు.