ఇంజక్షన్‌ వికటించి మహిళ మృతి

ABN , First Publish Date - 2023-03-30T23:42:43+05:30 IST

ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి గిరిజన మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండలపరిధి నాగారం గ్రామంలో గురువారం సా యంత్రం జరిగింది.

ఇంజక్షన్‌ వికటించి మహిళ మృతి
మృతిచెందిన విస్లావత్‌ గమినిబాయి

వైద్యం చేసిన ఆర్‌ఎంపీపై మృతురాలి కుటుంబీకుల దాడి

ధారూరు, మార్చి 30: ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి గిరిజన మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండలపరిధి నాగారం గ్రామంలో గురువారం సా యంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌ తండాకు చెందిన విస్లావత్‌ గమినిబాయి(48) కుమ్మర్‌పల్లిలో ఉన్న తన కూతురు కవిత వద్దకు వెళ్లింది. కాగా గమినిబాయి చేతి వేలు తెగి గాయం కావడంతో వైద్యం కోసం గురువారం మధ్యాహ్నం నాగారంలోని ఆర్‌ఎంపీ నాగేష్‌ వద్దకు వెళ్లింది. నాగేష్‌ ఆమెను పరీక్షించి ఇంజక్షన్‌ ఇచ్చాడు. సూది మందు ఇచ్చిన కొద్ది సేపటికే గమినిబాయి నురగలు కక్కుతూ కిందపడిపోయింది. దీంతో ఆర్‌ఎంపీ వెంటనే గమినిబాయిని మెరుగైన చికిత్స కోసం కారులో వికారాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందింది. గమినిబాయి కుటుంబీకులు చేరుకొని నాగే్‌ష ఇంజక్షన్‌ ఇవ్వడంవల్లే ఆమె మృతిచెందిందని అతడిపై దాడిచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-03-30T23:42:43+05:30 IST