రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం.. భర్తకు తీవ్ర గాయాలు
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:57 PM
ఇబ్రహీంపట్నం టౌన్ బస్టాండు వద్ద్ద శుక్రవారం ఉదయం బైక్పై వెళ్తున్న దంపతులను వెనక నుండి లారీ ఢీ కొనడంతో భార్య లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం చెందగా భర్తకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 29: ఇబ్రహీంపట్నం టౌన్ బస్టాండు వద్ద్ద శుక్రవారం ఉదయం బైక్పై వెళ్తున్న దంపతులను వెనక నుండి లారీ ఢీ కొనడంతో భార్య లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మరణం చెందగా భర్తకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం టౌన్ ఇందిరానగర్కు చెందిన వరికుప్పల కిష్ట్టయ్య, ఎల్లమ్మ(55) దంపతులు బైక్పై ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో బస్టాండు వద్ద వెనకాల వస్తున్న లారీ ఢీకొట్టింది. ఎల్లమ్మ లారీ చక్రాల కింద పడి నలిగి అక్కడికక్కడే దుర్మరణం చెందగా కిష్టయ్యకు తీవ్ర గాయాలైనాయి. స్థానికులు కిష్టయ్యను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నాడు.