ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2023-06-03T00:05:37+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు.
చేవెళ్ల, జూన్ 2 : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో డ్రంకెన్డ్రైవ్ కింద మొత్తం 108 కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. వాహనదారులపై జరిమానా రూ.3లక్షల5వేలు విధించినట్లు చెప్పారు. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వాసు, షాబాద్ సీఐ గురువయ్యగౌడ్, ఎస్సై విఠల్రెడ్డి, ఏఎస్సై చందర్నాయక్, తదితరులు ఉన్నారు.