అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయం

ABN , First Publish Date - 2023-02-21T23:50:23+05:30 IST

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు.

అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయం
విలేకరులతో మాట్లాడుతున్న బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న

దోమ, ఫిబ్రవరి 21: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్న దళితుడైనందువల్లే పాలకులు ఆయనను అవమానించారన్నారు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ దళిత ఎమ్మెల్యేలు గమనించాలని కోరారు. సిట్టిం గ్‌ ఎమ్మెల్యే సాయన్నను అవమానపర్చిన విధంగానే వారికీ ఇదే గతి పడుతుందన్నారు. దళితులకో న్యాయం, అగ్రవర్ణాలకు ఓ న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రమేశ్‌, మల్లేశ్‌, మొగులప్ప, భీమేశ్‌, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:50:25+05:30 IST