మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు
ABN , First Publish Date - 2023-06-02T23:37:33+05:30 IST
మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది.
కందుకూరు, జూన్ 2 : మహేశ్వరం నియోజకవర్గానికి రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సంబంధిత ఉత్తర్వులు వెలువరించింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.