వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

ABN , First Publish Date - 2023-06-02T23:35:29+05:30 IST

మండల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. లేమూరు గ్రామానికి చెందిన పాల్వాయి రవి(35) గురువారం రాత్రి బైక్‌పై షాద్‌నగర్‌కు వెళ్తూ బైరాగిగూడ వద్దగల మిర్చి ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి వస్తున్న కారును ఢీ కొట్టాడు

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

కందుకూరు, జూన్‌ 2: మండల పరిధిలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. లేమూరు గ్రామానికి చెందిన పాల్వాయి రవి(35) గురువారం రాత్రి బైక్‌పై షాద్‌నగర్‌కు వెళ్తూ బైరాగిగూడ వద్దగల మిర్చి ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి వస్తున్న కారును ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో నేదునూరు గ్రామానికి చెందిన రైతు యాలాల క్రిష్ణారెడ్డి (45) ద్విచక్రవాహనం పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని మృతిచెందాడు. కందుకూరు మండల కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున నేదునూరు గ్రామానికి వెళ్తున్న క్రిష్ణారెడ్డి మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2023-06-02T23:35:29+05:30 IST