రెండు బైకులు ఢీ.. బాలుడి దుర్మరణం

ABN , First Publish Date - 2023-03-30T23:19:03+05:30 IST

ఎదురెదుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

రెండు బైకులు ఢీ.. బాలుడి దుర్మరణం

పరిగి, మార్చి 30: ఎదురెదుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని రుకుంపల్లికి చెందిన గొల్ల అంజయ్య,తన కొడుకు శశాంక్‌(13) పరిగి నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా, పరిగికి చెందిన నరేందర్‌ బైక్‌పై వికారాబాద్‌ నుంచి పరిగికి వస్తున్నాడు. ఇరువురి బైక్‌లు రుకుంపల్లి శివారులో ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న శశాంక్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అంజయ్య, నరేందర్‌లకు గాయాలయ్యాయి. పరిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-30T23:19:03+05:30 IST