గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2023-03-25T23:21:51+05:30 IST

మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని కండ్లకోయ బస్‌స్టాప్‌ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

మేడ్చల్‌టౌన్‌, మార్చి 25: మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని కండ్లకోయ బస్‌స్టాప్‌ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ మురళీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కండ్లకోయ బస్టాప్‌ వద్ద శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరపగా మృతుడి ఆచూకీ సంబంధించిన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-25T23:21:51+05:30 IST