విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

ABN , First Publish Date - 2023-03-14T23:02:09+05:30 IST

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్‌గుప్తా, ఎస్‌ఆర్‌ జి.సంతోష్‌ అన్నారు.

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

పరిగి, మార్చి 14: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్‌గుప్తా, ఎస్‌ఆర్‌ జి.సంతోష్‌ అన్నారు. మంగళవారం పరిగి జడ్పీహెచ్‌ఎ్‌స నెం.1, నెం.2బాలికల పాఠశాలలు, చిట్యాల్‌, గడిసింగాపూర్‌ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌తో బోధించాల న్నారు. పరీక్షల ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానంలో నిల పాలని సూచించారు. సమష్టి కృషితోనే ఫలితాలు వస్తాయన్నారు. జిల్లా మానిటరింగ్‌ అధికారి రవికుమార్‌, అబ్జర్వర్‌ గుత్త, ఎంఈవో హరిశ్చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-14T23:02:09+05:30 IST