టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీశైలం
ABN , First Publish Date - 2023-05-31T23:48:58+05:30 IST
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా షాద్నగర్కు చెందిన జర్నలిస్టు చెక్కల శ్రీశైలం ముదిరాజ్ ఎన్నికయ్యారు.
షాద్నగర్ అర్బన్, మే 31: తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా షాద్నగర్కు చెందిన జర్నలిస్టు చెక్కల శ్రీశైలం ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు షాద్నగర్లో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ నియామకపత్రాన్ని అందించారు. యూనియన్లకు అతీ తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పో రాటం చేయడానికి పల్లె రవికుమార్గౌడ్ అవకాశం కల్పించారని శ్రీశైలం తెలిపారు. ఈమేరకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు చెప్పారు.