ఆకులమైలారంలో గర్భిణులకు సీమంతాలు
ABN , First Publish Date - 2023-02-21T23:53:59+05:30 IST
మండలంలోని ఆకులమైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పంజగూడ, మాలగూడ, ఆకుల మైలారం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు.
కందుకూరు, ఫిబ్రవరి 21: మండలంలోని ఆకులమైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పంజగూడ, మాలగూడ, ఆకుల మైలారం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు మంగళవారం సీమంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జి.కళమ్మరాజు, ఎంపీటీసీ అచ్చన్న పద్మపాండులు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మహిళలు అన్నిరంగాల్లో రాణించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. సుమారు ఏడుగురు మహిళలకు శ్రీమంతం, పలువురు చిన్నారులకు అక్షరభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాంరెడ్డి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, వనజ, పుష్పలత పాల్గొన్నారు.