ఎన్నికల ముసాయిదా జాబితాపై సమీక్ష

ABN , First Publish Date - 2023-08-22T00:06:47+05:30 IST

జిల్లాలో ఎన్నికలకు సంబందించి అన్ని విషయాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలు అన్నారు.

ఎన్నికల ముసాయిదా జాబితాపై సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి

మేడ్చల్‌ ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఎన్నికలకు సంబందించి అన్ని విషయాల్లో జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు తమ సహకారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియలు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 19వ తేదీ వరకు ప్రచురణలో భాగంగా ఏమైనా అభ్యంతరాలు, వాదనలు ఉన్నట్లయితే తెలుపాలన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో వచ్చే నెల 2, 3 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:06:47+05:30 IST