ఘనంగా చెన్నకేశవస్వామి పెద్ద రథోత్సవం
ABN , First Publish Date - 2023-02-06T23:56:10+05:30 IST
కడ్తాలలోని శ్రీలక్షీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కడ్తాలతో పాటు సమీప గ్రామాల భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
కడ్తాల్, ఫిబ్రవరి 6: కడ్తాలలోని శ్రీలక్షీచెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కడ్తాలతో పాటు సమీప గ్రామాల భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం తెల్లవారుఝామున స్వామివారి బ్రహ్మ రథోత్సవాన్ని(పెద్దతేరు) నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి రథాన్ని లాగారు. ఉత్సవ పర్యవేక్షకుడు మొళ్లూరి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేణుగోపాల్, శ్రీధర్, శ్రీమన్నారాయణ, వెంకటేశ్ పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ జి.శ్రీనివా్సరెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, ప్యాక్స్ చైర్మన్ గంప వెంకటేశ్, నాయకులు చేగూరి వెంకటేశ్, గూడూరు సాయిరెడ్డి, భాస్కర్రెడ్డి, జంగారెడ్డి, రవీందర్రెడ్డి, వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, రాఘవేందర్, యాదయ్యగౌడ్, లాయక్అలీ, జహాంగిర్అలీ, రాఘవచారి, నర్సింహ, బిక్షపతి, దాసు, ముత్తి కృష్ణ, ఎం.శ్రీను పాల్గొన్నారు.