కనుల పండువగా లక్ష్మీవేంకటేశ్వరుల రథోత్సవం
ABN , First Publish Date - 2023-01-21T22:37:15+05:30 IST
ఏటా నిర్వహించే బాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
చేవెళ్ల, జనవరి 21: ఏటా నిర్వహించే బాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. శనివారం చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రచ్చబండ వరకు 2కిలో మీటర్ల వరకు పూలరథంపై స్వామివారిని ఊరేగించారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8గంటల వరకు రథోత్సవం సాగింది. చేవెళ్ల గ్రామం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులు, ఆలయ ఫౌండర్లు రాఘవేంద్రచారి, వామనాచార్యులు, ధర్మకర్తలు శ్రీకాంతాచారి, శ్రీపాద్, పూజారులు అనంతం, వాసు, కన్నా, వైభవ్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, ఎంపీటీసీలు ఎస్.వసంతం, రాములు, నాయకులు ఎం.యాదగిరి, వెంకటమ్మవిఠలయ్య, విజయ్భాస్కర్రెడ్డి, బి.నర్సింలు, మాణిక్యరెడ్డి, గ్రామపెద్దలు, మహిళలు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సైలు అయ్యూబ్, ప్రదీప్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.