యువతను ప్రోత్సహించేందుకే క్విజ్ పోటీలు
ABN , First Publish Date - 2023-05-25T23:26:35+05:30 IST
యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకే టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్రెడ్డి అన్నారు.

డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి
దోమ, మే 25: యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకే టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మయిపల్లి గ్రామంలో గురువారం రాజీవ్గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్పై సదస్సు నిర్వహించారు. 16 నుంచి 35 వయస్సు కలిగిన యువతీ యువకులు క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు జూన్ 17లోపు 7661899899 సెల్నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. జూన్ 18న ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాలి విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మాలి రాంచంద్రారెడ్డి, రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, యాబుద్దీన్, గుడిసె రాములు, డి.వెంకటేశ్ పాల్గొన్నారు.