గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి : సర్పంచ్
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:53 PM
గర్భిణులు తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని సర్పంచ్ పంతంగి సుష్మరాజ్ భుపాల్గౌడ్ సూచించారు. శనివారం మండల పరిధిలోని పాల్మాకులలో అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం నిర్వహించారు
శంషాబాద్ రూరల్, డిసెంబరు 23 : గర్భిణులు తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని సర్పంచ్ పంతంగి సుష్మరాజ్ భుపాల్గౌడ్ సూచించారు. శనివారం మండల పరిధిలోని పాల్మాకులలో అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణులు పోషకాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ముఖ్యంగా గుడ్డు, పాలు, చేపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆరునెలల పిల్లలకు అన్నప్రాసన్న, మూడేళ్లు దాటిన పిల్లలకు అక్ష్యరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత, అరుణ, ప్రేమలత, మంజుల, నిర్మల, సుమలత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.