Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:12 AM

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పూడూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పూడూరు, డిసెంబరు 16: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పూడూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగడిచిట్టెంపల్లి గ్రామానికి చెందిన కావలి రవి(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య అనితతో గొడవపడ్డాడు. కోపంలో వ్యవసాయ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. ఇంటికి వచ్చి విషయాన్ని తెలపడంతో కుటుంబసభ్యులు వెంటనే వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి , అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:12 AM