పంచాయతీ కార్మికుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-05-19T23:58:35+05:30 IST
పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలోని అక్నాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
నవాబుపేట్, మే 19: పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలోని అక్నాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దయ్యాల రత్నయ్య(55) పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి గ్రామ శివారులో పురాతన ఇల్లు శామమ్మ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ అజయ్కుమార్ బాధిత కుటుంబానికి రూ.5వేలు, వైస్ ఎంపీపీ రూ.5వేలు, గ్రామస్థులు తమ వంతుగా రూ.20వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. మృతుడి కుటుంబానికి మాజీ సర్పంచ్ గోపాల్గౌడ్, గోపాల్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.