పక్కింటి వారి దాడి.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-05-31T23:58:01+05:30 IST
స్థలం విషయంలో గొడవ తలెత్తి పక్కింటి కుటుం బీకుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టేకులపల్లిలో చోటుచేసు కుంది.
మోమిన్పేట్, మే 31: స్థలం విషయంలో గొడవ తలెత్తి పక్కింటి కుటుం బీకుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టేకులపల్లిలో చోటుచేసు కుంది. ఎస్సై ఎం.విజయప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లికి చెందిన గొల్ల రాములు(48) తన పాత ఇంటిని కూల్చి నూతన నిర్మాణం చేపడుతున్నాడు. శేరిసందు విషయంలో అతడి పక్కింటికి చెందిన ఖాజా మొహినుద్దీన్, రహీమున్నీసా, జలాల్ పాషా, ఖైఫ్ అనేవ్యక్తులు రాములతో గొడవపడి అతడిని నెట్టేయగా రాములు డ్రైనేజీలో పడిపోయాడు. వెంటనే రాములు భార్య లక్ష్మి తన కుమారుడికి ఫోన్చేసి విషయం చెప్పారు. అక్కడికి చేరుకున్న రాములు కొడుకు మల్లేశ్ తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి సపర్యలు చేయగా అప్పటికే అతడు అపస్మారక స్థితికి వెళ్లాడు. ఆర్ఎంపీని పిలిపించి చూపించగా అతడు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. మల్లేశ్ తన స్నేహితుల సహాయంతో రాములను కారులో సంగా రెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి రాములు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై రాములు పెద్ద కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.