మైసిగండి హుండీ ఆదాయం రూ. 15,11,651

ABN , First Publish Date - 2023-06-07T23:40:40+05:30 IST

మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

మైసిగండి హుండీ ఆదాయం రూ. 15,11,651

కడ్తాల్‌, జూన్‌ 7 : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఫౌండర్‌ట్రస్టీ రమావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత, జిల్లా దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌కుమార్‌ సమక్షంలో హుండీ లెక్కించారు. 70రోజులకుగాను రూ. 15,11,651 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌పీ భాస్కర్‌, అరుణ్‌, యాదగిరి, బోడ ్యనాయక్‌, కృష్ణ, చంద్రయ్య, రాములు, దేవేందర్‌, రమాదేవి, శ్రీనివాసులు, పత్యనాయక్‌, వెంకటేశ్‌, కృష్ణయ్య, బీబీ చారి, శ్రీను, హర్షవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:40:40+05:30 IST