నేటి నుంచి పదో తేదీ వరకు లోక్ అదాలత్
ABN , First Publish Date - 2023-02-02T00:13:42+05:30 IST
ఈ నెల 2వ తేదీ నుంచి పదోతేదీ వరకు చేవెళ్లలో లోక్ అదాలత్ నిర్వహిస్తామని ట్రాఫిక్ ఏఎస్సై చందర్నాయక్ తెలిపారు.
చేవెళ్ల, ఫిబ్రవరి 1: ఈ నెల 2వ తేదీ నుంచి పదోతేదీ వరకు చేవెళ్లలో లోక్ అదాలత్ నిర్వహిస్తామని ట్రాఫిక్ ఏఎస్సై చందర్నాయక్ తెలిపారు. బుధవారం మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారు, లైసెన్స్ లేకుండా పట్టుబడిన వాహనదారులు తప్పని సరిగా లోక్అదాలత్కు హాజరై తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ మున్సిఫ్ కోర్టు ఆవరణలో ఉదయం9 గంటల నుంచి ప్రార ంభమవుతుందని, అవకశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.