‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలి’

ABN , First Publish Date - 2023-06-03T00:02:37+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి, షాద్‌నగర్‌ నియోజక వర్గానికి సాగునీరు అందించాలని వైఎస్సార్‌టీపీ, ప్రజా సంఘాల నాయకులు అన్నారు.

‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించాలి’

షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 2: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి, షాద్‌నగర్‌ నియోజక వర్గానికి సాగునీరు అందించాలని వైఎస్సార్‌టీపీ, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈమేరకు శుక్రవారం రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిషత్‌ ఆఫీసు ఎదుట వైఎస్సార్‌టీపీ షాద్‌నగర్‌ ఇన్‌చార్జి ఇబ్రహీం, ప్రజా ఫ్రంట్‌ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్‌ కె.రవీంద్రనాథ్‌ తదితరులు దీక్షకు పూనుకున్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి, షాద్‌నగర్‌ నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని పదిహేనేళ్లుగా కేసీఆర్‌ హామీ ఇస్తూ వస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రిలే దీక్షకు పూనుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-06-03T00:02:37+05:30 IST