పల్లెల అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2023-07-12T00:13:46+05:30 IST

ప్రతీ పల్లెను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని, అందుకు జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి నిర్వహిస్తున్న పల్లె పల్లెకు పట్నం అవినా్‌షరెడ్డి కార్యక్రమం నిదర్శనమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. పల్లె పల్లెకు పట్నం అవినా్‌షరెడ్డి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని హైతాబాద్‌, పెదవేడు, నాందార్‌ఖాన్‌పేట్‌, లింగారెడ్డిగూడ గ్రామాల్లో అవినా్‌షరెడ్డితో కలిసి అనిత ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పల్లెల అభివృద్ధి ఘనత కేసీఆర్‌దే
మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి

జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి

షాబాద్‌, జూలై 11 : ప్రతీ పల్లెను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని, అందుకు జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి నిర్వహిస్తున్న పల్లె పల్లెకు పట్నం అవినా్‌షరెడ్డి కార్యక్రమం నిదర్శనమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. పల్లె పల్లెకు పట్నం అవినా్‌షరెడ్డి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని హైతాబాద్‌, పెదవేడు, నాందార్‌ఖాన్‌పేట్‌, లింగారెడ్డిగూడ గ్రామాల్లో అవినా్‌షరెడ్డితో కలిసి అనిత ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అవి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతీ ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. అనంతరం అవినా్‌షరెడ్డి మాట్లాడుతూ.. జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యల సహకారంతో మండలానికి అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీరాంరెడ్డి, యూత్‌ మండలాధ్యక్షుడు పీసరి సతీ్‌షరెడ్డి, కో-ఆప్షన్‌ మెంబర్‌ చాంద్‌పాషా, ఏఎంసీ మాజీ చైర్మన్లు శ్రీనివా్‌సగౌడ్‌, వెంకటయ్య, నాయకులు నర్సింహారెడ్డి, దర్శన్‌, భూపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-12T00:14:15+05:30 IST