Share News

బీఆర్‌ఎస్‌ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కార్తీక్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-10-28T00:42:42+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చినప్పటికీ పార్టీలో అక్కడక్కడా నాయకుల మధ్య విభేదాలు, అసమానతలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల వారీగా పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది.

 బీఆర్‌ఎస్‌ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా కార్తీక్‌రెడ్డి

చేవెళ్ల, అక్టోబరు 27 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చినప్పటికీ పార్టీలో అక్కడక్కడా నాయకుల మధ్య విభేదాలు, అసమానతలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల వారీగా పార్టీ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తోంది. ఇందులో భాగంగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా దివంగత ఇంద్రారెడ్డి రాజకీయ వారసుడు, మంత్రి సబితారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అధిష్టానం చేవెళ్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కొనసాగారు. అయితే, మారిన రాజకీయ పరిణామాలతో కార్తీక్‌రెడ్డికి పార్టీ అధిష్టానం బాధ్యతుల అప్పగించింది. చేవెళ్ల నియోజకవర్గంలో ఇంద్రారెడ్డి కుటుంబానికి లోకల్‌గా బలమైన పట్టు ఉండటం, యాదయ్య గెలుపు కోసం పార్టీ బాధ్యతలు కార్తీక్‌రెడ్డికి ఇవ్వడంతో పార్టీ శ్రేణలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకురుతుందని నాయకులు చర్చించుకుంటున్నా రు. కాంగ్రెస్‌, బీజేపీలకు దీటుగా ఎన్నికల్లో గెలిచేలా పార్టీ వ్యూహరచనలో భాగంగానే కార్తీక్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిందని సమాచారం.

Updated Date - 2023-10-28T00:42:42+05:30 IST