కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చ
ABN , First Publish Date - 2023-07-17T00:34:14+05:30 IST
కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చఅని ఘట్కేసర్ మున్సిపాలిటీ వంశరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామల ముత్యాలు అన్నారు.
ఘట్కేసర్, జూలై 16: కారంచేడు ఘటన సమాజానికి మాయని మచ్చఅని ఘట్కేసర్ మున్సిపాలిటీ వంశరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్యామల ముత్యాలు అన్నారు. ఘట్కేసర్లో ప్రబుద్ద భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్కు నివాళి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏదులాబాద్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేటితో కారంచేడు ఘటనకు 38ఏళ్లు గడుస్తున్నాయని అన్నారు. అగ్రవర్ణాలు, దళితుల మధ్య జరిగిన ఘర్షణలో అనేకమంది దళితులు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈసందర్భంగా కారంచేడు మృతులకు నివాళులర్పించారు. అలాంటి ఘటనలను పునారావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రబుద్ధ భారత్ సంస్థ ప్రతినిధి మీపాల అరుణ్కుమార్ అంబేద్కర్ను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, దాసు, బాలయ్య, శ్రీనివాస్, సైదులు, రాజేష్, కృపాకర్, తెజ, మనోహర్, పరమేష్, మధు పాల్గొన్నారు.