శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2023-03-30T23:25:12+05:30 IST
మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురవారం రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ నూతన విగ్రహాన్ని అట్టహాసంగా ప్రతిష్ఠించారు.
ధారూరు, మార్చి 30: మండల పరిధిలోని నాగారం గ్రామంలో గురవారం రాత్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ నూతన విగ్రహాన్ని అట్టహాసంగా ప్రతిష్ఠించారు. జిల్లా వాలీబాల్ అసోషియేషన్ అధ్యక్షుడు జైదుపల్లి హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఎం. కిరణ్కుమార్ రెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు కలిసి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శుక్రవర్ధన్ రెడ్డి, నాయకులు వీరేందర్రెడ్డి, నరోత్తంరెడ్డి, గోవర్దన్రెడ్డి, అంజయ్య, రాంచంద్రయ్యగౌడ్, రామ మందిర్ కమిటీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.