వికారాబాద్ కౌన్సిలర్కు ఇండియన్ హానరబుల్ అవార్డు
ABN , First Publish Date - 2023-06-11T23:23:20+05:30 IST
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ ఇండియన్ హానరబుల్ అవార్డు 2023ను పొందారు.
వికారాబాద్ రూరల్, మే 10: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ ఇండియన్ హానరబుల్ అవార్డు 2023ను పొందారు. కరోనా సమయంలో పట్టణంలోని 31వ వార్డులో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ వార్డు ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.