పేదల భూములను గుంజుకుంటే ఉద్యమించాలి
ABN , First Publish Date - 2023-05-31T23:15:10+05:30 IST
పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని, దానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని ప్రజాయుద్ద నౌక గద్దర్ అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్
ఘట్కేసర్, మే 31 : పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని, దానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని ప్రజాయుద్ద నౌక గద్దర్ అన్నారు. బుధవారం ఘట్కేసర్లో మహనీయుల జయంత్యుత్సవాల సందర్బంగా ఘట్కేసర్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల భూముల జోలికొస్తే తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. సీఏం కేసీఆర్ ప్రజలకిచ్చిన హమీలను మరిచాడని విమర్శించారు. ప్రధానంగా దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి హమీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాటతప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గద్దర్ పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.