ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2023-05-25T23:22:11+05:30 IST

కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి సూచించారు.

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: ఆర్డీవో
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో

దోమ, మే 25: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి సూచించారు. దోమ మండల కేంద్రంలో గురువారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తహసీల్దార్‌ కార్యాలయంలో మిల్లర్‌ల యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తాలు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలులో కోతలు విధిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దిర్సంపల్లిలో మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఆమె రెండు, మూడు రోజుల్లో అదనపు గోదాంను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ షాహేదాబేగం, ఆర్‌ఐ లింగం, ఏవో ప్రభాకర్‌రావు, మిల్లర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:22:11+05:30 IST