ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2023-09-21T23:25:26+05:30 IST
మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
వికారాబాద్, సెప్టెంబరు 21: మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్లోని ధర్మ విద్యాలయంలో గురువారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ట్రెయినింగ్ ఇచ్చి 60మందికి ఉచిత కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను చైర్పర్సన్ మంజుల రమే్షతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వాతి రాజ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దీప భక్తవత్సలం, వైస్చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, నాయకులు శ్రీనివా్సగౌడ్ పాల్గొన్నారు.