కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2023-03-05T23:41:49+05:30 IST

కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అన్ని కులాల ప్రజల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోడ్పడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఘట్‌కేసర్‌లో యాదవ సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు టి.శ్రీనివా్‌సయాదవ్‌, మల్లారెడ్డి

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌

ఘట్‌కేసర్‌, మార్చి 5: కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అన్ని కులాల ప్రజల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తోడ్పడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. ఆదివారం ఘట్‌కేసర్‌ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సంఘ భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఆకర్శిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, మల్లయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనిజంగయ్యయాదవ్‌, వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, స్థల దాతలు అనిత, సబిత, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:41:49+05:30 IST