ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2023-03-30T23:44:07+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుసగా రెండో రోజూ బంగారం పట్టుబడింది. గురువారం దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం లభించగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు
శంషాబాద్, మార్చి 30 : శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుసగా రెండో రోజూ బంగారం పట్టుబడింది. గురువారం దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం లభించగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు హ్యాండిల్లో ఉండే తీగలాగా బంగారాన్ని మార్చి అక్రమంగా తీసుకొస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతని నుంచి 224 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13.72 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.