ఏవీఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలి
ABN , First Publish Date - 2023-03-05T23:54:58+05:30 IST
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతిస్తున్న ఏవీఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించుకుందామని బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్ పిలుపునిచ్చారు.
కేశంపేట :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతిస్తున్న ఏవీఎన్ రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించుకుందామని బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్ పిలుపునిచ్చారు. కొండారెడ్డిపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఏవీఎన్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని టీచర్లుకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. జీవో 317తో ఇబ్బంది పడుతున్న టీచర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు పల్లె ఆనంద్కుమార్, రాజు, కుమారస్వామి, శ్రీనివాస్, గోపాల్రెడ్డి, తిరుపతయ్య, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.